దొంగ లెక్కలు చెప్పారు !!
మహేష్ బాబు , శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆగడు తాజాగా
ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్
రికార్డు సృష్టించాయని చిత్ర యూనిట్ ప్రకటించింది . ఈ సినిమా
మొదటిరోజు నైజం ఏరియాలో 3.45 కోట్ల వసూలు చేసిందంటూ పీఆర్ఓ బిఎరాజు మీడియాకి ఓ ప్రకటన
విడుదల చేశాడు . చిత్ర నిర్మాతలు అందించిన సమాచారం ప్రకారం ఈయన
మీడియా వారికి కలెక్షన్స్ రిపోర్ట్ ని పంపించారు.నైజం ఏరియాలో ‘ఆగడు’ అసలు కలెక్షన్స్ 2.98
కోట్లు మాత్రమే అనే టాక్ వినిపిస్తుంది.
ప్రతి సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ ని ప్రముఖ
డిస్ట్రిబ్యూటర్ సంస్థ సురేష్ ఫిలిమ్స్
సేకరిస్తుంది. ఆ వివరాల ప్రకారం ఆగడు మొదటి రోజు కేవలం 2.98
కోట్లు మాత్రమే వసూళ్లు చేసిందని ,
చిత్ర
యూనిట్ తప్పుడు కలెక్షన్స్ ప్రకటించిందని
తెలుస్తుంది . ఇక మిగిలిన ఏరియాల్లో కూడా కలెక్షన్స్ తప్పుడు
లెక్కలే అనే వాదన కూడా వినిపిస్తుంది.
Post a Comment