మహేష్ బాబు, తమన్నా జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “ఆగడు” సినిమా ఈ నెల 19న
విడుదలవబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైనర్
సంస్థ వారు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో
నిర్వహిస్తున్నారు.”దూకుడు” సినిమా తరువాత
మళ్ళీ అదే కాంబినేషన్
లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, ఈ మధ్య “ఆగడు’ నిర్మాణ సంస్థ వారికి ఇన్కంటాక్స్ డిపార్టుమెంటు
నుంచి ఫోన్ కాల్ వచ్చిందట. సాధారణంగా కొన్ని పెద్ద పెద్ద సినిమాలు
రిలీజ్ అయ్యే టైంలో ఇన్కంటాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేస్తారు కదా, ఈ సినిమాకి
కూడా అంతే అనుకుంటున్నారా?
అలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.
ఇన్కంటాక్స్ వారు ఫోన్ చేసింది మహేష్ “ఆగడు” సినిమా
టికెట్ల కోసమట. మరో కొద్ది రోజులలో విడుదలయ్యే ఈ సినిమా టికెట్ల కోసమే వారు
ఫోన్ చేసినట్టు
ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అసలుకంగారు పడిన
సిబ్బంది విషయం తెలిసిన తరువాత 14 రీల్స్
సిబ్బంది ఒక్కసారిగా కంగారు నుంచి బయటపడినట్టు సమాచారం.సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ
మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ శంకర్ కూడా తెరకే అందానిచ్చే హీరో మహేష్ అంటూ
కాంప్లిమెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఇన్కంటాక్స్
వారు నిర్మాణ సంస్థకి ఫోన్ చేసి మరీ టికెట్లు బుక్ చేసుకున్నారంటే
మహేష్ కి ఇది మరో కంప్లిమేంట్ లాంటిదే కదా!
Post a Comment