GuidePedia

0

వివి వినాయక్ కూడా హుదుద్ బాదితుడే !!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్  వి.వి. వినాయక్ కూడా హుధూద్ తుపాన్ బాధితుడేనని కొంచం లేట్గా తెలిసింది. వినాయక్‌కి విశాఖలో వీ మ్యాక్స్ పేరిట ఓ థియేటర్ వుంది. మొన్నటి తుపాన్‌లో ఈ థియేటర్ పూర్తిగా ధ్వంసమైందట. ఖరీదైన పరికరాలు, మెషినరి, ఇంటీరియర్స్ తుపాన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నష్టం మొత్తం విలువ సుమారు రూ. 1కోటి వుంటుందని అంచనా వేస్తున్నారు. 2013లో వచ్చిన నాయక్ సినిమాతోనే ఈ థియేటర్ ప్రారంభోత్సవం జరుపుకున్నట్లు సమాచారం. అంతకుముందే నిర్మించి వున్న ఓ థియేటర్‌ని తీసుకున్న వినాయక్.. ఆ థియేటర్‌కి రెనెవేషన్ చేసినట్లు విశాఖ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓవైపు తుపాన్ కారణంగా ఓ కోటి వరకు నష్టపోయిన కూడా ఆయన తుపాన్ బాధితుల సహాయార్థం రూ. 10 లక్షలు ప్రకటించడం అభినందించదగిన విషయమే అంటున్నారు. 

Post a Comment

 
Top