GuidePedia

0


ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనున్న సినిమా లాంఛనంగా రామనాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మాతలు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతిహాసన్ కథానాయికగా నటించనుంది.
డైరెక్టర్ వి.వి.వినాయక్ పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనుమోల్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. తొలి సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో మహేష్ సతీమణి నమ్రతాశిరోద్కర్, రాజకీయ నాయకులు దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు,రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నాగం జనార్ధన్ రెడ్డి, అచ్చయ్య నాయుడు, మహేష్ బావ స్వరూప్, జెమిని కిరణ్, బెల్లంకొండ సురేష్, దిల్ రాజు, అనిల్ సుంకర, గోపీ అచంట, సాయి కొర్రపాటి తదితరులు పాల్గొని చిత్రం యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసారు.
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
మహేష్ బాబు, శృతిహాసన్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, బ్రహ్మానందం, ముఖేష్ రుషి, సంపత్, సుబ్బరాజు, తులసి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ - మది, ఆర్ట్ - ఎ.యస్.ప్రకాష్, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు - అశోక్ కుమార్ రాజు.యం, చంద్రశేఖర్ రావిపాటి
నిర్మాతలు - ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్
కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - కొరటాల శివ.















Post a Comment

 
Top