భారీ నిర్మాతని ఛీ కొట్టిన రాంగోపాల్ వర్మ !!
ఈమధ్య అల్లుడు శ్రీను పుణ్యమా అని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్
తరుచూ మీడియా కి దర్శనం ఇస్తున్నారు . చాలా కాలంగా దాచుకున్న రహస్యాలన్నీ
ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు . నటనపై ఉన్న మక్కువతో ఈయన సినిమాల్లో నటించాలని ఈ
రంగాన్ని ఎంచుకున్నారట. అయితే రాంగోపాల్ వర్మ ఇతన్ని స్టూడియోలో చూసి ‘ఛీ అవతలికి పో’
అన్నాడట. కానీ ఇప్పటికీ రాము అంటే చాలా ఇస్తామని ఎప్పటికైనా ఆయనతో ఓ
సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు.అలాగే ఓ సినిమా తీసి ఎన్ని కోట్లు సంపాదించిన
తీసుకురాని ఆనందాన్ని రవితేజ రూపంలో తనకు రెండు సార్లు వచ్చిందని అన్నారు ‘నా ఆటో గ్రాఫ్’ , ‘శంబో శివ శంబో’ సినిమాలతో తన కెరీర్లో బెస్ట్ పిక్చర్స్ అని , ఒక
నటుడికి గుర్తింపు , ఓ నిర్మాతకి సంతృప్తి తీసుకురాగల
చిత్రాలని అయన తెలిపాడు . తన కుమారుడి మరో కొత్త సినిమా ఈనెల 27 నుంచి మొదలవుతుందని , హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదని తెలిపాడు.
బెల్లంకొండ డ్రీం ప్రాజెక్ట్ మాత్రం తెలుగులో తన కుమారుడి హీరోగా ధూమ్ వంటి
ప్రాజెక్ట్ ని రూపొందించడమే అట .
Post a Comment