GuidePedia

0


శృతిహాసన్ గురించి ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ న్యూప్రాజెక్టులో ఈమె నటిస్తోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.అల్లుడు శీనులో సమంత హీరోయిన్‌ కాగా తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. హీరోయిన్ల వల్లే ఈ చిత్రం బీ,సీ, సెంటర్లలో ఆడుతోందని ఫిల్మ్‌ నగర్లో ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఇదిలావుండగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో కొత్త ప్రాజెక్టు రెడీ కానుందట. ఈ హీరో సరసన స్టార్ హీరోయిన్ శృతిహాసన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమెని నిర్మాత ఇప్పటికే సంప్రదించి స్టోరీ చెప్పాడట. ఈమె సానుకూలంగా స్పందించినట్లు చెప్పుకుంటున్నారు. కొత్త హీరో అని చెప్పడంతో శృతి రెమ్యునరేషన్ ఎక్కువగానే డిమాండ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. కొడుకుని స్టార్ హీరో చేయడం కోసం నిర్మాత మాంచి స్కెచ్ వేశాడని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి డీటేల్స్ త్వరలో వెల్లడికానున్నాయి. 

Post a Comment

 
Top