GuidePedia

0

హిట్ కోసం గుళ్ళు చుట్టూ తిరుగుతునారు !!

సినిమా వాళ్లకి భక్తితో పాటు సెంటిమెంట్లు కూడా ఎక్కువన్న సంగతి మనకు తెలిసిందే. తమ సినిమాల రిలీజ్ సమయంలో తమ ఇష్ట దైవాన్ని సందర్శించి, మొక్కులు తీర్చుకుంటూ వుంటారు. ఆ విధంగా ప్రముఖ నిర్మాత రామానాయుడు తిరుపతి, బాలకృష్ణ యాదగిరిగుట్ట వెళుతుంటారు. ఇక ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల సింహాచలంకి మహేష్ అజ్మీర్ దర్గాకి వెళతారు. ఇప్పుడు కూడా తన 'ఆగడు' సినిమా రిలీజ్ ముందు అక్కడికి వెళ్ళారు.
 
శ్రీను వైట్ల మాట్లాడుతూ  "నా ప్రతి సినిమా విడుదల ముందు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటాను. స్వామి ఆశీస్సులతో 'ఆగడు' సినిమా సక్సెస్ అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాలో కొత్త శక్తి ప్రవేశిస్తుంది. స్వామి పవర్ అటువంటిది" తన తదుపరి చిత్రం రామ్ చరణ్ తో ఉంటుందని ఆయన తెలిపాడు.

అలాగే మహేష్ బాబు అజ్మీర్ దర్గాను సందర్శించారు. ఖ్వాజా మొయినుద్దీన్ చస్తీ వద్ద మహేష్ బాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ఆగడు రేపు విడుదల కానుంది. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆయన ఆక్షాంకించారు. బిజినెస్‑మెన్, దూకుడు, వన్ నేనొక్కడినే చిత్రాలలో హీరోగా నటించిన మహేష్ బాబు విడుదలకు ముందు ఈ దర్గాను సందర్శించారు.

Post a Comment

 
Top