చిక్కులో పడ్డ ఎన్టీఆర్ తాజా చిత్రం
టాలీవుడ్ లో వరుసపెట్టి సినిమా షూటింగ్ లు నిరసనలు,
ధర్నాల కారణంగా నిలిచిపోతున్నాయన్న విషయం తెలిసినదే. అయితే దీని కారణంగా ఎన్.టి.ఆర్ – పూరి ల
కాంబినేషన్ లో ఈ నెల 18న గోవా వెళ్ళి, 20 నుండి షూటింగ్
జరుపుకోనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ అవనుందని
చెప్తున్నారు. చర్చలు ముగిశాక తదుపరి తేదీలను వెల్లడించే అవకాశం వుంటుందని
తెలిపారు. ఆంధ్రావాలా సినిమా తర్వాత ఎన్టీఆర్ – పూరి లు కలసి చేస్తున్న ఈ సినిమాలో
హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ చిత్రానికి నిర్మాత బండ్ల గణేష్, సంగీతం
అనుప్ రూబెన్స్.
Post a Comment