GuidePedia

0

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాలో నిత్య మీనన్ !!

కేరళ కుట్టి నిత్యామీనన్ మొదటి సారి ఓ భారీ మూవీలో ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. 'గుండెజారి గల్లంతయ్యిందే' తర్వాత సడెన్‌గా టాలీవుడ్‌కు దూరమైన నిత్యా.. శర్వానంద్‌తో 'మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు', 'రుద్రమదేవి'లో స్పెషల్ రోల్ మాత్రమే చేసిందని టాక్. క్యారెక్టర్లు, రెమ్యునరేషన్ నచ్చక  మలయాళ మూవీస్ చేస్తున్న నిత్యా.. రీసెంట్‌గా మణిరత్నం మూవీలో హీరోయిన్ ఆఫర్ దక్కించుకుంది. తాజాగా త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో 'జులాయి' బ్యానర్ నిర్మించే మూవీలో నిత్యా ఓ హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయిందని టాక్. ముందుగా ఈ రోల్ ప్రణీతకు ఓకే అయినా ఇపుడా ప్లేస్‌లో నిత్యాను ఫిక్స్ చేశారని వినిపిస్తోంది. సమంత, అదా శర్మలతో నిత్యా ఈ మూవీలో మూడో హీరోయిన్‌గా నటిస్తోంది. తన రోల్‌కు ఇంపార్టెన్స్ లేకుంటే ఒప్పుకోని నిత్యా.. సమంతకు పోటీగా నిలుస్తుందో లేదో త్వరలో తేలనుంది.

Post a Comment

 
Top