నాగార్జున - కార్తి లతో భారి మల్టీ స్టారర్ !!
దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ నిర్మాణ సంస్థగా పేరొందిన ‘పి.వి.పి సినిమా’
ఎప్పుడూ
తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తదనాన్ని
పంచుతూనే ఉంది. తాజాగా ఈ సంస్థ ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని
రూపొందించనుంది. తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు సూపర్స్టార్ల
కలయికలో ఓ చిత్రాన్ని నిర్మించనుంది.
తెలుగు సూపర్స్టార్ అక్కినేని నాగార్జున మరియు తమిళ సూపర్స్టార్ కార్తీల
కాంబినేషన్లో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
పి.వి.పి సినిమా తమ అత్యుత్తమ నిర్మాణ విలువలతో ఈ
చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా
రూపొందింనుంది.
అక్కినేని నాగార్జునకు తెలుగులోనే కాకుండా తమిళ చిత్రసీమలోనూ మంచి ఇమేజ్
ఉంది. అలాగే కార్తీ ఇటీవలె ‘మద్రాస్’ చిత్రంతో తమిళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. కార్తీకి
తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో
వస్తున్న ఈ చిత్రం ద్వారా తెలుగు`తమిళ ఇండస్ట్రీలను ఏకం చేసే అద్భుత
అవకాశాన్ని పి.వి.పి సొంతం చేసుకోవడం విశేషం. ఈ చిత్రానికి
సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం!
Post a Comment