గోపీచంద్ కి వాళ్ళు ధమ్కీ ఇచ్చారు !!
ఈ ఆరడుగుల
ఆజానుబాహుడికి ధమ్కీ ఇచ్చేంత ధైర్యం
ఎవరికుందని ఆలోచిస్తున్నారా? అయితే మీరు తప్పులో
కాలేసినట్లే. ఎందుకంటే ఇది గోపీచంద్కి నిజంగా
ఇచ్చిన ధమ్కీ కాదు.. యూవీ ప్రొడక్షన్లో ఆయన హీరోగా తెరకెక్కనున్న తర్వాతి సినిమాకి ఇచ్చిన టైటిల్. కొన్ని టైటిల్స్ పరిశీలించిన తర్వాత ఫైనల్గా 'ధమ్కీ' టైటిల్ని డిసైడ్
చేశారు.
'మిర్చి', 'రన్ రాజా రన్' సినిమాలు నిర్మించిన ఉప్పలపాటి
ప్రమోద్,
వంశీకృష్ణా రెడ్డిలు 'ధమ్కీ' మూవీకి నిర్మాతలు. గతంలో గోపీచంద్తో 'లక్ష్యం' సినిమా చేసిన
డైరెక్టర్ శ్రీనివాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక గోపీచంద్ ప్రస్తుత పరిస్థితి విషయానికొస్తే, త్వరలోనే 'లౌక్యం' మూవీతో ఆడియెన్స్
ముందుకు రానున్న గోపీచంద్ ఆ సినిమాపై చాలా ఆశలే పెంచుకున్నాడు. గోపీచంద్ చివరి సినిమాలు 'వాంటెడ్', 'మొగుడు', 'సాహసం' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాపడ్డాయి.
'సాహసం' సినిమా అంతో ఇంతో
హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమెర్షియల్గా
సినిమా పరాజయం పాలుకాకతప్పలేదు. దీంతో ఇప్పుడు రానున్న 'లౌక్యం' అయినా తనకి
పూర్వవైభవాన్ని తెస్తుందేమోనని గోపీచంద్ భావిస్తున్నాడు.
Post a Comment