GuidePedia

0

వర్మ పై మరో కేసు !!

వినాయకుడిపై ట్విట్టర్‑లో వ్యాఖ్యలు చేసి.. ప్రజల మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీశారంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ముంబైలోని ఓ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణను అంధేరి మేజిస్ట్రేట్ ఈనెల 30వ తేదీకి పోస్ట్ చేశారు. ఇండస్ కమ్యూనికేషన్స్ ఎండీ, కన్స్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా మీడియా సెల్ అధ్యక్షుడు అయిన వివేక్ శెట్టి కోర్టులో ఈ మేరకు ఫిర్యాదు చేశారు.వినాయకుడు తన భక్తుల కష్టాలు ఎందుకు తీర్చలేకపోతున్నాడని రాంగోపాల్ వర్మ ప్రశ్నించడమే కాక.. ఆయన శారీరక విషయాలపై కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవి హిందువుల మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నారని అందులో తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 295, 504, 505లను వర్మ ఉల్లంఘించినట్లయిందన్నారు.

Post a Comment

 
Top