పాకిస్తాన్ లో త్రిష !!
హీరోయిన్ త్రిష సౌతిండియాలో ఫేమస్ హీరోయిన్ . తెలుగు , తమిళం భాషల్లో అనేక
సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కట్టా మీఠా అనే సినిమా
ద్వారా బాలీవుడ్లోనూ నటించింది. అంతకు మించి ఆమె మన దేశ బోర్డర్ దాటి నటించలేదు.
అయితే త్రిష ఫోటోతో కూడిన హోర్డింగ్ పాకిస్తాన్ లోని పెషావర్ సిటీలో
దర్శనిస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అసలు విషయానికి వస్తే….ఓ 3డి గేమ్ కు సంబందించిన అడ్వర్టేజ్మేంటులో
పాకిస్తాన్ లోని పెషావర్ త్రిష ఫోటోతో కూడిన హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. ఆమె
ఎవరనేది ఇతరులెవరూ గుర్తు పట్టకపోయినా….సౌతిండియన్స్ మాత్రం
పెషావర్ సిటీలో ఆమె ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు . ప్రస్తుతం త్రిష తెలుగులో
బాలయ్య సరసన సత్యదేవ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తుంది . దాంతో పాటు
తమిళంలో భూలోహం , తాలా55 , మణిరత్నం
ప్రాజెక్ట్ లో , సూరజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో అవకాశాలు
దక్కించుకుంది.
Post a Comment