ఆ భారీ నష్టాలలో 'దిల్'రాజు !!
గతంలో భారీ చిత్రాలు నిర్మించిన నిర్మాత దిల్ రాజు
గురించి పరిశ్రమలో రకరకల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం ఈ మధ్య
విడుదలైన రభస , ఆగడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలకు
డిస్ట్రిబ్యూటర్స్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజు భారీ నష్టాలు వచ్చాయని, దాంతో ఆర్ధిక
ఇబ్బందుల్లో ఆయన కూరుకుపోవడంతో నిర్మాతగా తన తర్వాతి
సినిమా కేరింతని ప్రస్తుతానికి వాయిదా వేశారని అంటున్నారు. అయితే ఈ వార్తలని అయన
ఖండిస్తున్నారు దిల్ రాజు . స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయాల్సిన
అవసరం ఉండడంతో 25 రోజుల
పాటు షూటింగ్ ని ఆపామని ,
త్వరలో మళ్ళీ
సినిమాని ప్రారంభిస్తామని అయన అంటున్నారు. కానీ ఫిల్మ్ నగర్ వర్గాలు
మాత్రం పై మూడు సినిమాల డిస్ట్రిబ్యూషన్ వలన అయన దాదాపు 15 కోట్లకు పైగా
నష్టాలు చవిచుశాడని అంటున్నారు . సుమంత్ అశ్విన్ , లావణ్య త్రిపాఠి హీరో
హీరోయిన్లుగా నటిస్తున్న ఈ కేరింత సినిమాకి సాయి కిరణ్ అడవి
దర్శకత్వం వహించబోతున్నారు.
Post a Comment