GuidePedia

0


ఆ భారీ నష్టాలలో 'దిల్'రాజు !!

గతంలో భారీ చిత్రాలు నిర్మించిన నిర్మాత దిల్ రాజు గురించి పరిశ్రమలో రకరకల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం ఈ మధ్య విడుదలైన రభస , ఆగడు,  గోవిందుడు అందరివాడేలే సినిమాలకు డిస్ట్రిబ్యూటర్స్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజు భారీ నష్టాలు వచ్చాయని, దాంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఆయన కూరుకుపోవడంతో నిర్మాతగా తన తర్వాతి సినిమా కేరింతని ప్రస్తుతానికి వాయిదా వేశారని అంటున్నారు. అయితే ఈ వార్తలని అయన ఖండిస్తున్నారు దిల్ రాజు . స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉండడంతో 25 రోజుల పాటు షూటింగ్ ని ఆపామని , త్వరలో మళ్ళీ సినిమాని ప్రారంభిస్తామని అయన అంటున్నారు. కానీ ఫిల్మ్ నగర్ వర్గాలు మాత్రం పై మూడు సినిమాల డిస్ట్రిబ్యూషన్ వలన అయన దాదాపు 15 కోట్లకు పైగా నష్టాలు చవిచుశాడని అంటున్నారు . సుమంత్ అశ్విన్ , లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ కేరింత సినిమాకి సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహించబోతున్నారు.

Post a Comment

 
Top