'వన్', 'ఆగడు' పరాజయాల తర్వాత మహేశ్ బాబు తన సినిమాల
బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఈ రెండు చిత్రాలు నిర్మాతలకు
తీవ్ర నష్టాలు మిగల్చడానికి ఓవర్ బడ్జెట్టే కారణమని ఆయన
బావిస్తున్నాడని అంటున్నారు. 'ఆగడు' కోసం 55 కోట్లు, 'వన్ నేనొక్కడినే'
చిత్రం కోసం సుమారు 70
కోట్లు 14 రీల్స్ సంస్థ ఖర్చుపెట్టింది (అది వారి
మాటే). ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కడం వల్లే ఈ రెండు సినిమాలు కాస్ట్
ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయాయని మహేశ్ ఓ అంచనాకు వచ్చాడని ఆయన సన్నిహిత వర్గాలు
చెబుతున్నాయి. దీంతో, ఇకపై తన రాబోయే చిత్రాలు ఎట్టిపరిస్థితుల్లోను 40
కోట్ల బడ్జెట్ దాటకూడదని మహేశ్ నిర్మాతలకు
స్పష్టం చేస్తున్నాడట! ఈ నేపథ్యంలోనే, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న
తాజా చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీస్ అధినేతలకు
బడ్జెట్ ను ఎట్టిపరిస్థితుల్లోను 40కోట్లు దాటనివ్వొద్దని మహేశ్
హెచ్చరికగా చెప్పినట్టు తెలుస్తోంది.
|
Post a Comment