GuidePedia

0

హుదుద్ బాధితులకి 50 లక్షల సహాయం చేసిన పవన్

రెండు రోజుల క్రితం ప్రకృతి సృష్టించిన విలయ తాండవంలో విశాకపట్నం మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలు బాగా దెబ్బతిన్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఈ వరద బాధితులకు సాయం చెయ్యడం కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో ప్రజలు, ప్రభుత్వమే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు కూడా ముందుకు వచ్చి తమవంతు సాయం చేస్తున్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హుదుద్ సైక్లోన్ బాధితుల సహాయార్ధం 50 లక్షల రూపాయలను రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చారు. ఈ 50 లక్షల చెక్ ను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందించనున్నారు. అలాగే ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏదో చేస్తుంది అని కాకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి సాయం చెయ్యాలని కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.  ఈ రోజు ఉదయమే రామ్ చరణ్ 15 లక్షలు విరాళంగా ప్రకటించాడు. మంచు మనోజ్ కూడా ఈ సైక్లోన్ బాధితులకు సాయం చెయ్యడం కోసం తన టీం తో కలిసి వైజాగ్ వెళ్లి సాయం అందిస్తున్నారు.

Post a Comment

 
Top