ఆ డైరెక్టర్ ని బూతులు తిట్టిన సమంత !!
నటి సమంతకు
కథానాయికిగా టాలీవుడ్లో ఎంత పేరో కోలీవుడ్లో
అంత పూర్ అనే చెప్పాలి. ఇక్కడ విజయాల నటి. అక్కడ అపజయాల నటి. ఈ చెన్నై చిన్నదాని అదృష్టంలో అక్కడికి, ఇక్కడికి ఎంత తేడా? తమిళంలో ఇటీవల నటించిన అంజాన్ చిత్రంతో సహా అన్నీ ఆమెకు నిరాశపరచినవే. అదే
టాలీవుడ్లో అయితే మనం చిత్రం వరకు చాలా
విజయాలు ఈ అమ్మడి ఖాతాలో చేరాయి. ఇక ఇప్పుడీ భామ తాజా చిత్రం కత్తిపైనే ఆశలు పెట్టుకుంది. విక్రమ్ సరసన
నటిస్తున్న చిత్రం నిర్మాణంలోనే ఉంది.
ఈ చిత్రం మినహా కోలీవుడ్లో కొత్తగా అవకాశాలేమీ లేవు. ఈ విషయం అటుంచితే సమంత శాంతమూర్తి అని ఆమె కసలు కోపమే రాదని, అందరి తోను సరదాగా కలసిపోతుందనే టాక్ ప్రచారంలో ఉంది. తనకు చెడు తలపెట్టేవారి పైకి కోపం
ప్రదర్శించదనే ప్రచారం జరుగుతోంది. ఇదే
విషయాన్ని సమంత వద్ద ప్రస్తావించగా తన గురించి ఎవరలా అంటోంది. తానెంత ముక్కోపినో తనకే తెలియదు అని
చెప్పింది. ఆమె ఇంకా మాట్లాడుతూ తనకెంత
కోపం వచ్చినా దాన్ని బయటకు ప్రదర్శించనంది. ఆ మధ్య ఒక దర్శకుడు చాలా అసహనానికి గురి చేశారని తెలిపింది. ఒకే
సన్నివేశాన్ని మళ్లీ మళ్లీ తీస్తూ
కష్టపెట్టినట్లు చెప్పింది. అలా అరగంట సేపు అదే సన్నివేశాన్ని చిత్రీకరించడంతో ఆయనపై పట్టరాని కోపం వచ్చిందని చెప్పింది.
దీంతో మనసులోనే రాస్కేల్, వెర్రి వెంగలప్ప, పంది అంటూ ఆ
దర్శకుడిని తిట్టేశానని తెలిపింది. తనకు కోసం
వస్తే ఇలానే లోలోనే తిట్టేస్తానని సమంత చెప్పింది.
Post a Comment