హీరో అవుతున్న పూరి కొడుకు !!
ప్రముఖ
దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ త్వరలో హీరోగా పరిచయం అవుతున్నాడు. గతంలో 'ధోని' వంటి కొన్ని సినిమాలలో బాలనటుడిగా నటించిన ఆకాష్ తన అభినయానికి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో
ఇప్పుడీ కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ
రాజ్ మాదిరాజు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.ఆమధ్య
'రుషి' చిత్రానికి దర్శకత్వం
వహించిన రాజ్ ఆ చిత్రానికి గాను ఉత్తమ కథకుడిగా నంది
అవార్డు కూడా అందుకున్నాడు. ఈ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆకాష్ ను పరిచయం చేయడానికి పూరీ జగన్నాథ్ అంగీకరించినట్టు
చెబుతున్నారు. ఈ చిత్రాన్ని 'ప్రసాద్' గ్రూప్ అధినేత రమేష్
ప్రసాద్ నిర్మిస్తారు. 'టైం పాస్' అనే మరాఠీ సినిమా
ఆధారంగా దీనిని రూపొందిస్తారు.
Post a Comment