రభస దెబ్బకి చుక్కలు కనిపించాయటా !!
జూనియర్
ఎన్టీఆర్ హీరోగా నటించిన 'రభస'. ఆ సినిమాతో వచ్చిన భారీ నష్టాలకి నిర్మాత బెల్లంకొండ సురేషుకు దిమ్మతిరిగిపోయింది. దీంతో భారీగా బకాయిలు
పెరిగిపోయాయి. తన కొడుకు శ్రీనివాస్ నటించిన 'అల్లుడు
శ్రీను' ఓమాదిరి విజయం
సాధించినప్పటికీ అతను బయటపడలేకపోయారు. దాంతో తన తనయుడి తదుపరి
మూవీని నల్లమలుపు బుజ్జికి అప్పగించారు. అల్లు అర్జున్ హీరోగా తను నిర్మించిన 'రేసుగుర్రం' బ్లాక్ బస్టర్
హిట్‑తో మంచి ఊపుమీద ఉన్నా బుజ్జి
నిర్మించే ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన తమన్నా నటించే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వం
వహించే ఈ చిత్రంపై ఇంకా చర్చలు
కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించి, వెంటనే షూటింగ్ ప్రారంభించే
అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్.
Post a Comment