GuidePedia

0

ఎన్టీఆర్ - పూరి మధ్య విభేదానికి కారణం కళ్యాణ్ రామ్ ??

ఎన్టీఆర్ , పూరి జగన్నాథ్ కొత్త సినిమా ఆగిపోయినట్లు ఫిలింనగర్లో పుకార్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. చివరకు ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ జోక్యంతో అటువంటిది ఏమి లేదని సెప్టెంబర్ 10 నుంచి రెండో షెడ్యుల్ ప్రారంభం కాబోతుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినా కానీ ఈ సినిమాపై పుకార్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా వార్త ఏమిటంటే…. ఎన్టీఆర్ , పూరి జగన్నాథ్ ల మధ్య కథ విషయంలో విబేధాలు రావడానికి కారణం కతెలుస్తుంది కళ్యాణ్ రామ్ అని తెలుస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ కొత్త సినిమా పటాస్ స్టొరీ లైన్ కి దగ్గరగా ఎన్టీఆర్ , పూరి జగన్నాథ్ సినిమా ఉంటుందట. అందుకే కథలో మార్పులు చేయమని ఎన్టీఆర్ దర్శకుడిపై ఒత్తిడి తెచ్చాడట. కానీ పూరి మాత్రం ససేమీరా అనడంతో షూటింగ్ ఆగిపోయినదనే పుకారు పుట్టుకొచ్చింది. అసలు నిజం ఏదైనా కానీ , ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే వరకు ఈ సినిమాకు సంబంధించి ఇటువంటి పుకార్లు చాలా వస్తూనే ఉంటాయని అంటున్నారు కొందరు.

Post a Comment

 
Top