ఆగడు ప్రభావం : పంచ్ డైలాగ్స్ అంటే భయపడుతున్న మహేష్
ఆగడు సినిమా నేర్పిన గుణపాఠమో లేక ముందు జాగ్రత్తో
తెలీదు కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా కొరటాల శివతో కలిసి చేస్తున్న
ప్రాజెక్ట్ కి చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటిది
పంచ్ డైలాగులు
లేకుండా చూసుకోవడమేనట. అవును.. లేటెస్ట్ ఫిలింనగర్ టాక్ ప్రకారం కొత్త సినిమాలో
గతంలోలాగా పంచ్ డైలాగ్లు లేకుండా జాగ్రత్త వహించాలని డైరెక్టర్ కొరటాల శివకు
సూచించినట్లు సమాచారం. అలాగే ప్రిన్స్ పాత సినిమాల్లో రెగ్యులర్ నటులైన నాజర్, ప్రకాష్ రాజ్ వంటి వాళ్లు ఈ
సినిమాలో లేకుండా చూసుకుంటున్నారు. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, మిర్చి విలన్ సంపత్ రాజ్ లు ఈ సినిమాలో
ప్రధానపాత్రలు
పోషిస్తున్నారు. 'దూకుడు'కి
అచ్చుగుద్దిన విధంగానే ఆగడు సినిమా వుందనే విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఇకనైనా
తన లేటెస్ట్ సినిమాలో కొత్తదనం చూపించాలని ప్రిన్స్ భావిస్తున్నట్లు
చెప్పుకుంటున్నారు.
Post a Comment