వీళ్ళు మళ్లీ మొదలుపెట్టారు !!
చెన్నై చిన్నది త్రిష, దగ్గుబాటి
రానా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అబ్బే మేమిద్దరం... మంచి ఫ్రెండ్స్ మాత్రం
అంటున్న వీరిద్దరు మలేషియాలో జరుగుతున్న
అవార్డుల కార్యక్రమానికి కలిసి వెళ్లారు. ఇలా వీరిద్దరూ కలిసి వెళ్లటం ఇది
రెండోసారి. అసలు విషయానికి వస్తే ప్లయిట్‑లో త్రిష....రానాతో కలిసి దిగిన ఓ ఫోటోను
'వుయ్ ఆర్ ఆన్ బోర్డ్' అని
తన ట్విట్టర్‑లో పెట్టింది. మలేషియాలో జరుగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ
అవార్డ్స్ ఈవెంట్‑కు ఈ జంట హాజరవుతోంది. ఇక తాజా ఫోటోపై ట్విట్టర్‑లో.... క్యూట్ కపుల్,
వెల్కమ్ టూ మలేషియా ప్రిన్సెస్స్, త్రిష
సో క్యూట్, యూ బోత్ లుక్ గ్రేట్ టు గెదర్. బెస్ట్ కపుల్,
నైస్ ఫోటో, నైస్ పెయిర్ అంటూ కామెంట్స్ వెల్లువెత్తాయి.
ఇక ఇటీవల జరిగిన దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో
ఈ జంట హల్‑చల్ చేసింది. వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని ఆ వేడుకలో స్పెషల్
ఎట్రాక్షన్‑ అయ్యారు. కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా త్రిష మాత్రం
ఎప్పటికప్పుడు మీడియాలో నానుతూనే ఉంది. గతంలో దుబాయ్‑లో జరిగిన సైమా అవార్డుల
ఫంక్షన్‑లోనూ వీరిద్దరూ కలిసే కనిపించారు. రానా, త్రిషల మధ్య
సమ్‑థింగ్ సమ్‑థింగ్ అని వదంతులు వచ్చినా, వీరిద్దరూ మాత్రం
తాము మంచి స్నేహితులమేనంటూ ఇప్పటికీ కొట్టిపారేస్తున్నారు.
Post a Comment