GuidePedia

0

దాని దెబ్బకి కరెంట్ తీగ వాయిదా పడింది

మనోజ్ హీరోగా, మంచు విష్ణు నిర్మాతగా నిర్మించిన సినిమా కరెంట్ తీగ’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 17న భారీగా రిలీజ్ కావడానికి సిద్దమైంది. కానీ హుదుద్ సైక్లోన్ రూపంలో సృష్టించిన ప్రళయం వలన కరెంట్ తీగ సినిమాని వాయిదా వేసారు. గత రెండు రోజులుగా కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని హుదుద్ సైక్లోన్ అతలాకుతలం చేసింది. ఈ రోజు ఉదయానికి ఆ సైక్లోన్ తీవ్రత కాస్త తగ్గింది. ఈ సైక్లోన్ వలన చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి.  ఈ కారణంగా ఈ చిత్ర టీం సినిమా రిలీజ్ ని వాయిదా వేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ చిత్ర టీం మొత్తం వైజాగ్ వెళ్లి ఆక్కడ తమకు చేతనైన సాయం చేయనున్నామని మనోజ్ తెలిపాడు. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా సన్నీ లియోన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అచ్చు సంగీతం అందించాడు.

Post a Comment

 
Top