GuidePedia

0

 14 రీల్స్ బ్రేకప్, ఆ ముగ్గురు విడిపోతున్నారా ?

నమో వెంకటేశ, దూకుడు, 1 నేనొక్కడ్నే, లెజెండ్, ఆగడు.. ఇలా 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ చిత్రాలనే నిర్మించారు. ఈ ముగ్గురు నిర్మాతల మధ్య ఎంత అనుబంధం ఉండి ఉంటే.. ఇలా వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు అని  చాలామంది చెప్పుకున్నారు కూడా. అయితే ఇప్పుడీ ముగ్గురి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. దీనికి ప్రధాన కారణం 'ఆగడు' అని చెప్పుకుంటున్నారు. ఈ ముగ్గురి మధ్య మనస్పర్థలకు అసలు కారణాలు బయటకు రాలేదు కానీ.. ఇకనుంచి విడివిడిగా సినిమాలు నిర్మించాలనుకుంటున్నారట. అనిల్ సుంకర్ సోలోగా, రామ్, గోపి కలిసి సినిమాలు నిర్మిస్తారని భోగట్టా. స్నేహితుల నుంచి విడిపోయిన తర్వాత అనిల్ సుంకర నిర్మించబోయే చిత్రానికి రచయిత గోపీ మోహన్ దర్శకత్వం వహించనున్నాడని, ఈ చిత్రంలో సునీల్ హీరోగా నటించే అవకాశముందని సమాచారం. అలాగే, రామ్, గోపీ సంయుక్తంగా నిర్మించే చిత్రంలో నాని హీరోగా నటించనున్నాడని వినికిడి. ఏదేమైనా 14రీల్స్ బ్రేకప్ ఎంతవరకూ నిజమనేది కాలమే చెప్పాలి. 


Post a Comment

 
Top