GuidePedia

0

ఆగడు ఎఫెక్ట్ - ఫ్రీగా దర్శకత్వం చేస్తున్నాడు

మహేష్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ఆగడు ఫ్లాప్ అవడంతో నిర్మాతలకు , చిత్ర పంపిణీదారులకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపధ్యంలో 14 రీల్స్ సంస్థ కోసం శ్రీనువైట్ల ఓ సినిమాని ఉచితంగా చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం . ఆగడు సినిమాతో నిర్మాతలకు వచ్చిన నష్టాలని పుడ్చేందుకు శ్రీనువైట్ల ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.  ఆగడు సినిమా కోసం శ్రీనువైట్ల శ్రీనువైట్ల రూ.11 కోట్ల భారీ పారితోషికం తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం.ఆగడు తర్వాత రామ్ చరణ్ తో తదుపరి సినిమా చేస్తున్నానని శ్రీనువైట్ల గతంలో ప్రకటించాడు. అయితే శ్రీనువైట్ల ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ ప్రస్తుతం పెండింగ్ లో పెట్టారు. ఆగడు సినిమా ఫ్లాప్ తర్వాత శ్రీనువైట్ల తో చేసేందుకు రాంచరణ్ సుముఖంగానే ఉన్నాడని , అయితే రచయితలుగా కోన వెంకట్ , గోపి మోహన్ లు పెట్టుకోవాలని కండీషన్ పెట్టాడని మెగా వర్గాల సమాచారం. కానీ, వారిద్దరి అవసరం లేకుండానే రామ్ చరణ్ ని ఒప్పించేందుకు శ్రీనువైట్ల కథపై తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

Post a Comment

 
Top